కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య: చెట్టుకు ఉరేసుకున్న వ్యక్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంత్రాలయం మండలం పి.తండాలో భార్యాభర్తల మధ్య ఘర్షణ విషాదానికి దారి తీసింది. ఇరువురి ఘర్షణతో మనస్తాపానికి గురైన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.

విషాహారం తినడంతో అస్వస్థత

కాగా, అదే జిల్లాలోని కోడుమూరు మండలం అమడగుంట్ల బీసీ హాస్టల్‌లో విషాహారం తిన్న 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.విద్యార్థుల అస్వస్థతకు కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Man commits suicide due to scuffle with wife

లభించిన మృతదేహం

కర్నూలు జిల్లా గాజులదిన్నె రిజర్వాయర్‌లో ఆదివారంనాడు గల్లంతైన మద్దిలేటి మృతదేహం లభ్యమైంది. వేముగోడు దగ్గర ఎల్‌ఎల్‌సీ కాల్వలో మృతదేహం బయటపడింది.

చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పాపయ్యనగర్‌ దగ్గర సముద్ర తీరంలో చెట్టుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం పంపించారు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

వికలాంగుడి ఆత్మహత్య

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల బస్టాండులో పెన్షన్‌ రావడం లేదనే మనస్థాపంతో ఓ వికలాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వికలాంగుడి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.

English summary
A man killed himself after a scuffle with wife in Kurnool district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X