భార్యను ఆర్నెల్లుగా నిర్బంధించిన భర్త, ప్రియుడి సుఖం కోసం ఘోరం
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో ఓ కసాయి భర్త ఆరు నెలలుగా తన భార్య, కుమారుడిని నిర్బంధించి వేధించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండపేటలోని ఆర్తమూరులో ఈ దారుణం జరిగింది. పుట్టింటి వారు చూడటంతో ఇది వెలుగులోకి వచ్చింది.
అదనపు కట్నం కోసం ఆరు నెలలుగా భార్యను, తనయుడిని నిర్బంధించి వేధించాడు. పుట్టింటి వారు వచ్చారు. దీంతో విషయం తెలిసిందే. గతంలోను అతను కట్నం కోసం వేధించారు. పెద్ద మనుషులు భర్తను ఒప్పించడంతో, భార్య కాపురానికి వచ్చింది.
ప్రియుడి సుఖం కోసం..
ప్రియుడి కోసం కొడుకును అమ్మి, కూతురు కళ్లలో కారం కొట్టిన సంఘటన తూర్పు గోదావరి జిల్లలో జరిగింది. ఈ సంఘటన రాజమండ్రిలో జరిగింది. ఓ మహిళకు వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఆమె భర్తను వదిలేసింది.
తమకు అడ్డుగా ఉన్న పిల్లలను వదిలించుకోవాలని ఆ తల్లి భావించింది. కొడుకును అమ్మేసింది. నాలుగేళ్ల కూతురును తప్పించేందుకు ఒళ్లంతా గాయాలు పెట్టారు. సిగరేట్లతో కాల్చారు. ఆ తర్వాత ప్రియుడితో కలిసి కూతుర్ని చంపేయాలనుకుంది. స్థానికులు చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.