ఉద్యోగాల పేరుతో వ్యభిచార గృహాలకు యువతులు: వ్యక్తి పట్టివేత
విజయవాడ: నిరుద్యోగ యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అశ పెట్టి వ్యభిచార గృహాలకు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జార్ఖండ్కు చెందిన ఇద్దరు యువతులను విజయవాడ మీదుగా కేరళకు తరలిస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
ఆ ఇద్దరు యువతులను వ్యభిచార గృహాలకు అమ్మేందుకు ఢిల్లీ ముఠా ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తు్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, మిగతా ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే, కడప జిల్లాలో పోలీసులు ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు చైనా స్మగ్లర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చైనాకు చెందిన వారిని జూది, సూనిలుగా పోలీసులు గుర్తించారు. రూ. 15 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలతో పాటు కారును, ల్యాప్టాప్ను, 11 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
త్వరలోనే వారిని కోర్టులో ప్రవేశపెడుతామని పోలీసులు చెప్పారు. కాగా, విదేశీయుల వెనక ఎవరున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారమంతా నడుపుతున్నదెవరనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.