గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుపాకితో బెదిరించి మహిళ మెడలో తాళి చోరీ

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: జిల్లాలోని టెక్కలి మండల కేంద్రంలోని వెంకటేశ్వరకాలనీలో ఓ దుండగుడు తుపాకీతో ప్రజలను భయాందోళనకు గురిచేశాడు. తంగుడు స్వప్న అనే మహిళ మెడలో నుంచి తాళిని లాక్కుని వెళ్తుండగా.. ఆమె ప్రతిఘటించడంతో అతడు కాల్పులు జరిపాడు.

ఈ ప్రమాదంలో ఆమె కాలుకి గాయమైంది. దుండుగుడు ఆమెను పిస్టల్‌తో బెదిరించి పుస్తెలతాడు తీసుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న శ్రీకాకుళం జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

 a man stole women's gold chain

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం సీతారంపేట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలకు వెళ్తున్న సుమోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. మృతులు గుంటూరు జిల్లా మాచావరం మండలం గంగిరెడ్డిపాలెం వాసులుగా గుర్తించారు.

కృష్ణానదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు

గుంటూరు: కృష్ణానదిలో ఈతకెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. కొల్లూరు మండలం, చిలుమూరులంక దగ్గర ఈ ఘటన జరిగింది. గల్లంతయిన వారు నెహ్రూనికేతన్‌కు చెందిన ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థులు రూపేష్‌, మహేష్‌, బాల శివగణేష్‌, ఈశ్వర్‌, సాయివంశీగా గుర్తించారు. గల్లంతయిన వారి కోసం స్థానికులు గాలింపుచర్యలు చేపట్టారు. కాగా, ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. ఈత రాకపోవడంతోనే నదిలో గల్లంతైనట్లు తెలుస్తోంది.

English summary
A man stole women's gold chain threaten with gun in Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X