వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరుడు పరారీ, భర్త మారాడాని భార్య సూసైడ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: పెళ్లి ముందే పెళ్లి కొడుకు పరారైన సంఘటన కృష్ణా జిల్లా పటమటలో చోటుచేసుకుంది. వరుడు కనిపించకుండా పోవడంతో వధువు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరుడి బంధువులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

భర్త మారిపోయాడని భార్య ఆత్మహత్య

ప్రకాశం జిల్లాకు చెందిన సుమలత అనే యువతి సంతోష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఓ బాబు, పాప పుట్టారు. పెళ్లైన తర్వాత తన భర్త తనను కొడుతున్నాడని, విసుక్కుంటున్నాడని ఆరోపిస్తూ ఆ భార్య ఆత్మహత్య చేసుకుంది.

Man tries to kill in Vijayawada

ఈ నెల 1న సినిమాకు వెళ్దామని సుమలత భర్తను అడిగాడు. అతను నిరాకరించాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది నిద్రమాత్రలు మింగింది. భార్యను ఆసుపత్రిలో చేర్చిన ఆ భర్త పరారయ్యాడు. ఆమె సోదరుడు వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పేకాటరాయుళ్లు, క్రికెట్‌ బుకీల అరెస్ట్‌

పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి మండలం బాలవారిగూడెంలో పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 26వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని

తన భార్యతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఓ వ్యక్తి రోడ్డు పైన వీరంగం సృష్టించిన సంఘటన విజయనగరం జిల్లాలోని ఎస్ కోటలో జరిగింది. ఆ భర్త కత్తి పట్టుకుని హంగామా చేశాడు. శ్రీనివాస రావు అనే వ్యక్తి తన భార్యతో ఇబ్రహీం అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించాడు.

అతను ఇబ్రహీంపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాస రావును అదుపులోకి తీసుకున్నారు.

English summary
Man tries to kill in Vijayawada
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X