వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటుకు నోటులో జైలుకు: నిన్న బాబుకు.. నేడు జగన్‌కు మందకృష్ణ అండ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ నిరవధిక దీక్ష చేస్తున్న వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గురువారం మద్దతు పలికారు.

ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ... ప్రత్యేక హోదా ఐదు కోట్ల ఏపీ ప్రజల ఆకాంక్ష అన్నారు. ఆయన పోరాటానికి పూర్తి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు జగన్ దీక్షకు మద్దతు ఉంటుందన్నారు. వైసిపి భవిష్యత్తులో చేపట్టే పోరాటాల్లో భాగస్వాములం అవుతామని చెప్పారు. కాగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు మందకృష్ణ తెలంగాణలో టిడిపికి మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.

జగన్‌కు మందకృష్ణ మద్దతు

జగన్‌కు మందకృష్ణ మద్దతు

జగన్ దీక్ష పైన ఏపీ మంత్రులు, టిడిపి నాయకులు సంకుచితమైన మనస్తత్వంతో విమర్శలు చేస్తున్నారని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.

జగన్‌కు మందకృష్ణ మద్దతు

జగన్‌కు మందకృష్ణ మద్దతు

ఓటుకు నోటు కేసులో పీకల్లోతుకు కూరుకుపోయిన చంద్రబాబు జైలుకు వెళ్తాననే భయంతో ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించడం లేదని ఆరోపించారు.

పల్లె రఘునాథ్ రెడ్డి

పల్లె రఘునాథ్ రెడ్డి

ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గురువారం నాడు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారపట్టిన పల్లె.

పల్లె రఘునాథ్ రెడ్డి

పల్లె రఘునాథ్ రెడ్డి

ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గురువారం నాడు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యం.

English summary
MRPS cheif Manda Krishna Madiga extended his support to YS Jagan, who is on indefinite fast at Guntur demanding Special Status to AP. Krishna Madiga on Thursday visited the venue of fast and expressed his solidarity to Sri YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X