వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు, లోకేష్‌లపై ఆత్మాహుతి దాడికి వెనుకాడం: మావోయిస్ట్ పార్టీ హెచ్చరిక

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం : ఒడిశా ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకొంటామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ అధికార ఎపి అధికార ప్రతినిధి శ్యామ్ ఓ ప్రకటన విడుదల చేశారు.రాజకీయాలు తమ నుండి తప్పించుకొలేరని ఆయన హెచ్చరించారు.

చంద్రబాబునాయుడు తేనేపూసిన కత్తి అని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.ఓడిశా మారణకాండకు త్వరలోనే ఫలితాన్ని అనుభవిస్తారని ఆయన ఆరోపించారు.అవసరమైతే చంద్రబాబు కుటుంబంపై ఆత్మహుతి దాడికి దిగుతామని ఆయన హెచ్చరించారు.

maoist party tafget chandrababu family

ఎల్లకాలం పోలీసులు, మిలటరీ బాబును కాపాడలేరని ఆయన హెచ్చరించారు.మోడీ, చంద్రబాబు కుట్ర పలితమే ఒడిశా మారణకాండని ఆయన చెప్పారు. ఈ హాత్యకాండకు బదులు తీర్చుకొంటామని హెచ్చరించారు. కోవర్టు ద్వారా అన్నంలో విషం కలిపి మావోయిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారన్నారు.

తుపానుల్లో ఇది పెద్దదని, నాలుగు రోజుల్లో తట్టుకొని నిలబడుతామన్నారు శ్యామ్. పోలీసుల ఆధీనంలో ఉన్న మావోయిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను దేశ ద్రోహులుగా చిత్రీకరించి, విదేశీయులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారన్నారు. అవార్డులు,రివార్డుల కోసం పోలీసులు మిలట్రీ కిరాయి హాత్యలకు పాల్పడుతోందన్నారు.

English summary
maoist party tafget chandrababu family. maoist ap official spokes person release a preesnote today vizag. we will revenge babu ,and political leaders said maoist party.we will attack with suidebombers agaist chandrababu family said shyam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X