తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారి దర్శనం: తిరుమలలో వరుస కట్టిన మంత్రులు, ప్రముఖులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు వరుస కట్టారు. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాస రావు, పీ నారాయణ, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ తదితరులు తిరుమలకు వచ్చారు. వీరంతా ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.

వీరికి నిబంధనల ప్రకారం అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పూజారులు తీర్థ ప్రసాదాలు అందించారు. హీరో సాయిధరమ్ తేజ్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్ తదితరులు కూడా శ్రీవారిని దర్సించుకున్నారు.

కోలుకుంటున్న డాలర్‌ శేషాద్రి

Ministers and celebrities queue at Tirumala

శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలరు శేషాద్రి ఆరోగ్యం కుదుట పడుతోంది. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో డాలర్‌ శేషాద్రి చికిత్సపొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యతో డాలర్‌ శేషాద్రి శనివారం అస్వస్థతకు గురయ్యారు.

దేవుడి ఆశీస్సులు ఉంటాయి: నటి రాధిక

బెంగళూరు క్రికెటర్‌ అభిమన్యు మిథున్‌తో ప్రముఖ నటి రాధిక కుమార్తె రాయని నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా రాధిక తన ఫేస్‌బుక్‌ ఖాతాలో కుమార్తె నిశ్చితార్థం ఫొటోను పోస్ట్‌ చేశారు. వారికి దైవం ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయంటూ దీవించారు. రాయని, మిథున్‌ల నిశ్చితార్థం ఈనెల 24న చెన్నైలో జరిగింది.

English summary
Ministers and celebrities queue at Tirumala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X