వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అలా జగన్‌కు తప్ప ఎవరికీ సాధ్యం కాదు, ఆయన వల్లే రైతులకు నష్టం'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రులు అయ్యన్న పాత్రుడు, పత్తిపాటి పుల్లారావులు గురువారం నాడు తీవ్రంగా మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రులు అయ్యన్న పాత్రుడు, పత్తిపాటి పుల్లారావులు గురువారం నాడు తీవ్రంగా మండిపడ్డారు.

రాష్ట్ర బడ్జెట్‌లో రూ.లక్షా 15వేల కోట్లను నిరుద్యోగ భృతికి కేటాయించాలన్న ప్రతిపక్ష నేత జగన్‌ డిమాండ్ పైన అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్-లోకేష్‌లతో రివర్స్, 'సీఎం' ఎవరు?: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో సస్పెన్స్జగన్-లోకేష్‌లతో రివర్స్, 'సీఎం' ఎవరు?: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో సస్పెన్స్

రాష్ట్ర బడ్జెట్‌ రూ.లక్షా 30వేల కోట్లలో రూ.లక్షా 15వేల కోట్లను నిరద్యోగ భృతికి కేటాయించాలని అనడం జగన్‌కు తప్ప మరెవరికీ సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి కార్యకర్తలను పూర్తిస్థాయిలో సమాయాత్తం చేసేందుకు విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

ys jagan

రుణమాఫి విషయంలో ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. వైసీపీ కుట్ర కారణంగానే రైతులు నష్టపోయారన్నారు.

రేయిన్ గన్‌లపై కోర్టుకు వెల్లడంతో వినియోగం ఆలస్యమయిందని చెప్పారు. దీంతో రైతులు నష్టపోయారన్నారు. వడ్డీ కూడా కట్టలేదని వైసీపీ నేతలు రుణ మాఫీ గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.24 వేల కోట్ల రుణమాఫి చేశామని పత్తిపాటి తెలిపారు. రూ.11 వేల కోట్లు రెండేళ్లు తిరక్కుండానే బ్యాంకుల్లో జమ చేశామన్నారు. రూ. లక్షా 50వేల లోపు ఉన్న వాళ్లు ఒన్‌టైమ్ సెటిల్ అవుతున్నారన్నారు.

English summary
Ministers Ayyanna Patrudu and Pattipati Pulla Rao lashed out at YSRCP chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X