నంద్యాలలో చక్రం తిప్పేది వాళ్లే!: దాని పైనే జగన్-బాబు గెలుపు లెక్కలు
నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటర్లు వెల్లువెత్తుతున్నారు. గత మూడు పర్యాయాలు అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఓటింగ్ జరిగింది. ఈసారి 80 శాతానికి పైగా ఓటింగ్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటర్లు వెల్లువెత్తుతున్నారు. గత మూడు పర్యాయాలు అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఓటింగ్ జరిగింది. ఈసారి 80 శాతానికి పైగా ఓటింగ్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఓటింగ్ టర్నవుట్ను బట్టి విజయావకాశాలు
నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటింగ్ టర్నవుట్ను బట్టి విజయావకాశాలు ఉంటాయని అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. మొత్తానికి గతంలో కంటే భారీ ఓటింగ్ జరుగుతుందని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.
Recommended Video
గోస్పాడు కీలకం, చక్రం తిప్పేది వీళ్లే!
నంద్యాల ఉప ఎన్నికల్లో ఆయా వర్గాలతో పాటు గోస్పాడు మండలం చాలా కీలకంగా మారింది. అభ్యర్థి గెలుపోటమనులను ఈ మండలం మారుస్తుందని అంటున్నారు. మిగతా చోట్ల ఎవరి ఓటు బ్యాంకు వారికి ఉందని, ఇక్కడే చక్రం తిరుగుతుందని అంటున్నారు. సామాజిక వర్గాల వారిగా కూడా ఓట్లు కీలకం కానున్నాయి.
39 పోలింగ్ కేంద్రాలు
గోస్పాడులో 28,844 ఓటర్లు ఉన్నారు. ఇక్కడి వారు ఓటు ఇప్పుడు చాలా కీలకంగా మారిందని అంటున్నారు. గోస్పాడులో 39 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలీసులను భారీగా మోహరించారు.
ప్రచారంలో హోరాహోరీ
ఓటింగ్ టర్నవుట్ను బట్టి గెలుపోటములపై టిడిపి, వైసిపిలు అంచనాకు రానున్నాయి. ప్రచారం హోరాహోరీగా కనిపించింది. ఎవరూ స్పష్టంగా గెలిచే అవకాశాలు కనిపించలేదని అంటున్నారు. భారీ ఓటింగ్ తదితర లెక్కలు వచ్చాక తేలుతుందని అంటున్నారు.
ఎవరి వాదన వారిదే
ఓటింగ్ ఎక్కువ జరిగితే ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందని వైసిపి, చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు పడిందని టిడిపి చెప్పే అవకాశాలున్నాయి. భారీగా ఓటింగ్ జరిగితే ఎవరికి పడిందనే విషయం మాత్రం ఈ నెల 28న తేలనుంది.