వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై ‘302’ కేసు పెట్టాలి: నారాయణ ఫైర్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సిపిఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. శేషాచలం ఎన్‌కౌంటర్ బూటకమని, కూలీలను అడవులకు తీసుకొచ్చి పోలీసులు చంపారని ఆరోపించారు. ఇంతపెద్ద ఎన్‌కౌంటర్ చంద్రబాబుకు తెలియకుండా జరగదని అన్నారు.

కూలీల హత్యల కేసులో చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చాలని, అతనిపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. కూలీలు స్మగ్లింగ్ చేస్తుంటే పేదలుగా ఎందుకుంటారు? అని ఆయన ప్రశ్నించారు.

Narayana fires at Chandrababu

ఇది అంతం కాదు ఆరంభమేనన్న అటవీశాఖ మంత్రి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని అన్నారు. మంత్రులే ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తే మేజిస్టిరియల్ విచారణలో ఏం తేలుతుందని ప్రశ్నించారు.

అధికార, ప్రతిపక్ష నేతలకు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని నారాయణ ఆరోపించారు. సూత్రధారులపై చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వానికి లేదని అన్నారు. లక్ష ఎకరాల భూమిని కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తున్నారని అన్నారు. పేదలకు భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమని నారాయణ హెచ్చరించారు.

English summary
CPI Narayana on Saturday fired at Andhra Pradesh CM Chandrababu Naidu for seshachalam encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X