ఎర్రచందనం కేసు: నటి నీతూ అగర్వాల్కు షరతులతో బెయిల్
కర్నూలు: ఎర్రచందనం కేసులో అరెస్టైన నటి నీతూ అగర్వాల్కు షరతులతో కూడిన బెయిల్ లభించింది. ఎర్రచందన స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన మస్తాన్ వలీతో నీతూ అగర్వాల్ సహజీవనం చేస్తోంది. ఆమె కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ కు సహకరించిందనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆమెను తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు రెండు రోజుల పాటు ప్రశ్నించారు. ఆమె పోలీసు విచారణలో ఏం చెప్పిందనే విషయాలు తెలియడం లేదు.
ఎర్ర చందనం కేసులో సినీ నటి నీతూ అగర్వాల్ను కర్నూలు జిల్లా పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఎర్ర చందనం అక్రమ రవాణాలో మస్తాన్ వలీకి ఈమె సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. 13వ తేదీ నుండి నీతు కోసం పోలీసులు గాలిస్తూ చివరికి అదుపులోకి తీసుకోగలగారు.
నీతూకి ఎర్రచందనం స్మగ్లింగ్తో ఎలాంటి సంబంధం లేదని, తనతో సన్నిహితంగా ఉంటున్న కారణంగానే ఆమెపై కొందరు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని మస్తాన్ వలీ అన్నారు.