హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో వివాదం: సెక్రటేరియట్‌లో ఏపీ అధికారిని అడ్డుకున్న టీ ఉద్యోగులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ వివాదానికి సచివాలయం వేదికగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ అధికారుల సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్న బాచిన ఆంజనేయులు అధికార విభజనలో భాగంగా తెలంగాణకు కేటాయించారు.

అంతేకాదు ఆయన ప్రస్తుతం ఏపీ న్యాయశాఖ ఉప కార్యదర్శిగా ఉన్నారు. ఈ క్రమంలో, విధుల్లో చేరడానికి నిన్న ఆయన తెలంగాణ సచివాలయానికి వెళ్లారు. దీంతో, తెలంగాణ అధికారులు కొందరు ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది.

New controversy in ap secretariat at hyderabad

తెలంగాణలో చేరేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేదే లేదన్నారు. ఈ నేపథ్యంలో, ఆయన వెనక్కి వెళ్లిపోయారు. జరిగిన ఘటనపై ఏపీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్‌ కృష్ణారావుకి ఆయన వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారిని తాము ఎట్టి పరిస్ధితుల్లోనూ తెలంగాణ సచివాలయంలోకి అనుతించబోమని ఉద్యోగులు చెబుతున్నారు.

English summary
New controversy in ap secretariat at hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X