ఏఓబీలో అసలు ప్లీనరే జరగలేదు : మావోయిస్టు నేత కైలాసం
విశాఖపట్టణం :ఆంద్రా ఒడిశా సరిహాద్దులో అసలు ప్లీనరీ జరగలేదని మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజిన్ కార్యదర్శి కైలాసం ప్రకటించారు.శుక్రవారం నాడు ఆయన పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు.మావోయిస్టు నేత కైలాసం ప్రకటన కలకలం రేపుతోంది.
ఆంద్రప్రదేశ్, ఓడిశా సరిహాద్దులో జరిగిన ఎన్ కౌంటర్ బూటకమని ఆయన ఆరోపించారు. పార్టీ ప్లీనరే జరగలేదని ఆయన ఆ ప్రకటనలో చెప్పారు.ఉద్దేశ్యపూర్వకంగానే మావో అగ్రనేతలు రామకృష్ణ, గంగాధర్, దయాల ఫోటోలను విడుదల చేయలేదన్నారు.
రామగూడ ఎన్ కౌంటర్ బూటకమన్నారు.ఈ ఎన్ కౌంటర్ లో సాధారణ ప్రజలు కూడ మరణించారని ఆయన ఆరోపించారు.విద్రోహుల చర్య కారణంగానే మావోలు చనిపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎదురుకాల్పులు జరిగితే పెద్ద సంఖ్యలో మావోలు చనిపోరని ఆయన చెప్పారు.పెద్ద సంఖ్యలో మావోలను అదుపులోకి తీసుకొని విడతల వారీగా ఎన్ కౌంటర్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.కైలాసం పేరుతో మరో ఆడియా టేపు కూడ మీడియాకు అందింది.దీనిలో ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకొంటామని హెచ్చరించారు.