వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ్ బచావో!: ‘నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో’

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశ్ బచావో అంటూ ఓ పోస్టర్ విడుదల చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశ్ బచావో అంటూ ఓ పోస్టర్ విడుదల చేశారు. రాజకీయ అవకాశవాదులు, క్రిమినల్ రాజకీయాలకు వ్యతిరేకంగా జనసేన పోరాటం చేస్తుందని చెప్పారు. మ్యూజికల్ ఆల్బమ్ ద్వారా తమ వాదనను వినిపించనున్నట్లు పేర్కొన్నారు.

దేశం కోసం, భవిష్యత్ తరాల కోసం ప్రాణాలర్పించిన వారి ఆశయాల కోసం నిలబడతామని పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన సెషెంద్ర అనే పేరుతో ఉన్న ఓ సూక్తిని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 'నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో అది నీ శరీర క్షేత్రంలో ధైర్యంలో చల్లలేకపోతే అది నీ గుండెల్లో ఆత్మ గౌరవం పండించలేకపోతే నీవు బానిసగానే ఉండిపోవడానికి నిర్ణయించుకుంటే ఎంత ద్రోహివిగా మారావు ఆ పవిత్ర రక్తానికి..' అని ఆ పోస్ట్‌లో రాసివుంది.

'మేము పూల గుత్తులు వ్రేలాడే వసంత రుతువులం కాదు.. వట్టి మనుష్యులం! దేశం మాకు గాయలిచ్చినా నీకు మేము పువ్వులిస్తున్నాం.. ఓ ఆశచంద్రికల కుంభవృష్టి కురిశే మిత్రమా యోచించు ఏమి తెస్తావో.. మా అందరి కోసం ఓటు అనే బోటు మీద ఒక సముద్రం దాటావు..' అంటూ పాలకుల బాధ్యతల్ని గుర్తుచేస్తున్నట్లు ఉన్న మరో వ్యాఖ్యానాన్ని పోస్టు చేశారు పవన్.

జనసేన ఆల్బమ్

ప్రత్యేక హోదా పైన, తాజా రాజకీయ పరిస్థితుల పైన జనసేన ఆల్బమ్ రూపొందించింది. డీజే పృథ్వీతో ఈ ఆల్పమ్ చేశారు. మొదటి తమ్ముడు సినిమాలోని ట్రావెలింగ్ సోల్జర్ ఆడియో ట్రాక్.. ఆల్బంలో మొదటి పాటగా విడుదల చేశారు. తిరుపతి సభలో ఏ దేశమేగినా, ఎందుకాలిడినా అంటూ.. తాను చేసిన ప్యాకేజీ, పాచిపోయిన లడ్డూలు వ్యాఖ్యలను ఆడియోలో మిక్స్ చేశారు.

English summary
Jana Sena Party president Pawan Kalyan responded on politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X