టూర్ వాయిదా: పవన్కు ఆ హక్కుందని బీజేపీ నేత
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత పర్యటన ఇంకా ఖరారు కాలేదు. పవన్ నేడు రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో పర్యటిస్తారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదని జనసేన వర్గాలు చెప్పాయి.
ట్విట్టర్ ద్వారా టూర్ విషయం చెప్పిన పవన్ కళ్యాణ్
తన పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్లు పవన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. మార్చి 5న రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటానని పేర్కొన్నారు.
On
5th
March
I
will
be
visiting
the
capital
region
in
Andhra
Pradesh
and
will
meet
all
affected
farmers
and
communities
to
hear
them
out.
—
Pawan
Kalyan
(@PawanKalyan)
March
2,
2015
ఈ నెల 5వ తేదీన పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించవచ్చునని సమాచారం. అప్పుడు రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ పర్యటన చివరి నిమిషంలో వాయిదా పడిందని అంటున్నారు. ఈ రోజే పర్యటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఎందుకు రద్దు చేసుకున్నారనే చర్చ సాగుతోంది. మరోవైపు జనసేన వర్గాలు మాత్రం పర్యటన ఇంకా ఖరారు కాలేదని చెబుతున్నాయి.
పవన్ కళ్యాణ్కు హక్కు ఉంది: సోము వీర్రాజు
తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఆ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లే హక్కు పవన్ కళ్యాణ్కు ఉందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ నేత సోము వీర్రాజు అన్నారు. కేంద్ర బడ్జెట్ పైన అనవసర రాద్ధాంతం వద్దని చెప్పారు. బడ్జెట్లో ఏపీకి అన్యాయం పైన తాము కేంద్రాన్నికలుస్తామని చెప్పారు. ఈ నెల 10వ తేదీన ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. ఆరేళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్నారు.