వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టూర్ వాయిదా: పవన్‌కు ఆ హక్కుందని బీజేపీ నేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత పర్యటన ఇంకా ఖరారు కాలేదు. పవన్ నేడు రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో పర్యటిస్తారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదని జనసేన వర్గాలు చెప్పాయి.

ట్విట్టర్ ద్వారా టూర్ విషయం చెప్పిన పవన్ కళ్యాణ్

తన పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్లు పవన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. మార్చి 5న రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటానని పేర్కొన్నారు.

ఈ నెల 5వ తేదీన పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించవచ్చునని సమాచారం. అప్పుడు రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ పర్యటన చివరి నిమిషంలో వాయిదా పడిందని అంటున్నారు. ఈ రోజే పర్యటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఎందుకు రద్దు చేసుకున్నారనే చర్చ సాగుతోంది. మరోవైపు జనసేన వర్గాలు మాత్రం పర్యటన ఇంకా ఖరారు కాలేదని చెబుతున్నాయి.

Pawan Kalyan Thullur tour postponed

పవన్ కళ్యాణ్‌కు హక్కు ఉంది: సోము వీర్రాజు

తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఆ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లే హక్కు పవన్ కళ్యాణ్‌కు ఉందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ నేత సోము వీర్రాజు అన్నారు. కేంద్ర బడ్జెట్ పైన అనవసర రాద్ధాంతం వద్దని చెప్పారు. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం పైన తాము కేంద్రాన్నికలుస్తామని చెప్పారు. ఈ నెల 10వ తేదీన ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. ఆరేళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్నారు.

English summary
Janasena president Pawan Kalyan Thullur tour postponed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X