అ అంటే..: సరికొత్తగా నారా దేవాన్ష్ అక్షరాభ్యాసం, రాయించిన బాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అంతకుముందు పద్మావతి విశ్రాంత సముదాయంలో మనవడు దేవాన్ష్కు అక్షరాభ్యాసం చేయించారు.
తిరుపతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అంతకుముందు పద్మావతి విశ్రాంత సముదాయంలో మనవడు దేవాన్ష్కు అక్షరాభ్యాసం చేయించారు.
అనంతరం
కుటుంబ సమేతంగా వైకుంఠం 1 మీదుగా క్యూలైన్ మార్గంలో ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం
రంగనాయకుని మండపంలో పండితులు వారికి ఆశీస్సులు అందించారు. టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు వారికి ప్రసాదం అందజేసి సత్కరించారు.
అనంతరం
చంద్రబాబు మాట్లాడారు. దేవాన్ష్కు అన్నప్రాసన, అక్షరాభ్యాసం తిరుమలలో చేయించామన్నారు. అ అంటే అమ్మ, అమరావతి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్, ఆరోగ్యం, ఆదాయం అని దేవాన్ష్తో రాయించి నూతన సంప్రదాయానికి అంకురార్పణ చేయించామన్నారు.
ఈ సందర్భంగా
టిటిడి పాలకమండలి నియామకం త్వరలోనే జరుగుతుందని, తిరుపతిని ప్రపంచంలోనే నెంబర్ వన్గా సిటీగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు.