రామోజీ డాల్ఫిన్ హోటల్లో పేకాట: 8 మంది అరెస్టు
విశాఖపట్నం: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన విశాఖపట్నంలోని డాల్ఫిన్ హోటల్లో పేకాట ఆడుతున్న 8 మందిని పట్టుకున్నట్లు నగర టాస్క్ఫోర్స్ సిఐ ఇలియాస్ అహ్మద్ తెలిపినట్లు సాక్షి మీడియా రాసింది. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారమంటూ వార్తాకథనాన్ని ప్రచురించింది.
డాల్ఫిన్ హోటల్లో చాలా రోజులుగా పేకాట స్థావరం నడుపుతున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన కొందరు నగరంలోని ఓ పెద్ద హోటల్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం కొద్ది రోజుల క్రితమే టాస్క్ఫోర్స్కు చేరింది. అయితే ఏ హోటల్ అనేది నిర్ధారణ కాలేదు.
మంగళవారం మధ్యాహ్నం విశ్వసనీయమైన సమాచారం అందడంతో సిఐ ఇలియాస్ అహ్మద్ తన బృందంతో సాయంత్రం డాల్ఫిన్ హోటల్కు చేరుకున్నారు. బయట వేచి ఉండి లోపల ఏ గదిలో పేకాట ఆడుతున్నారో ఇన్ఫార్మర్ ద్వారా నిర్ధారించుకున్నారు.
సమాచారం నిజమేనని తేలడంతో వెంటనే హోటల్పై దాడి చేశారు. రూమ్ నెంబర్ 605లో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2.51,600 నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, హైదరాబాద్, కడప ప్రాంతాలకు చెందినవారు.