సర్వీస్ రివాల్వర్ పొగొట్టుకున్న ఎస్సైపై సస్పెన్షన్ వేటు...!
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో సర్వీస్ రివాల్వర్ పోగొట్టుకున్న ఓ ఎస్సై సస్పెన్షన్కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే ఆళ్లపల్లి ఎస్సై పృథ్వీరాజ్ దసరా సందర్భంగా నిర్వహించే ఆయుధపూజలో తన రివాల్వర్ పోగొట్టుకున్నాడు. అయితే, విషయం ఉన్నతాధికారులకు తెలియజేయకుండా దాచిపెట్టాడు.
కొన్ని రోజుల తర్వాత అధికారుల దృష్టికి వెళ్లడంతో, విచారణ జరిపి.. ఎస్సై పృథ్వీరాజ్ను సస్పెండ్ చేశారు. ఐతే , మిస్సైన పది రోజుల అనంతరం ఆ రివాల్వర్ స్టేషన్లో కనిపించిందంటున్నారు. కానీ ఈ విషయంపై అధికారంగా ధ్రువీకరించాల్సి ఉంది.
ఐతే మిస్సైన రివాల్వర్ ఎవరి వద్దకు వెళ్లింది, ఎలా వచ్చిందన్న విషయమై విచారణ జరుపుతున్నారు. ఖమ్మం జిల్లా ఆళ్లపల్లి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. అసలు డ్యూటీలో ఉన్నప్పుడు అంత అజాగ్రత్తగా రివాల్వర్ను ఎలా పొగొట్టుకున్నావంటూ.. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీఐజీ మల్లారెడ్డి, సత్తుపల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు.