ప్రొద్దుటూర్ చైర్మన్: టిడిపిXటిడిపి.. ఫర్నీచర్ ధ్వంసం, వైసిపి మౌనం
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నిక అంశం ఆదివారం కూడా ఉద్రిక్తతకు దారి తీసింది. టిడిపి రెబల్, అనుకూల కుమ్ములాటలతో పరిస్థితి వేడెక్కింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.
కడప: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నిక అంశం ఆదివారం కూడా ఉద్రిక్తతకు దారి తీసింది. టిడిపి రెబల్, అనుకూల కుమ్ములాటలతో పరిస్థితి వేడెక్కింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.
చైర్మన్ పదవి ఉప ఎన్నిక కోసం ఆదివారం కూడా సమావేశమయ్యారు. కానీ వరదరాజులు రెడ్డి వర్గీయులు, లింగారెడ్డి వర్గీయుల మధ్య రగడ రాజుకుంది. దీంతో తెలుగు తమ్ముళ్లు కుర్చీలు, బెంచీలు విరగ్గొట్టారు.
ప్రొద్దుటూరులో ఉద్రిక్తత: టీడీపీ, వైసీపీ ఘర్షణ, విధ్వంసం, 'మహిళా కౌన్సిలర్పై దాడి'
ఆదివారం వరదరాజులు రెడ్డి వర్గీయులు సమావేశానికి వచ్చే ప్రయత్నం చేయగా కొందరు అడ్డుకున్నారు. దీంతో లోపలకు చొచ్చుకెళ్లిన వారు ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఎన్నిక ప్రక్రియ ఆపాలని నినాదాలు చేశారు.
తెలుగుదేశంలోని రెండు వర్గాలు ఘర్షణకు దిగగా.. అక్కడే ఉన్న వైసిపి సభ్యులు మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోయారు. దీంతో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఆగిపోయింది.