కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాచపాళెంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖర రెడ్డికి ఈ ఏటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కడప జిల్లాకు చెందిన రాచపాళెం చంద్రశేఖర రెడ్డి మన నవలలు - మన కథానికలు అనే పుస్తకానికి ఉత్తమ విమర్శకుడిగా ఈ పురస్కారం లభించింది.

Rachapalem gets kedndriya sahithya akademi award

రాయలసీమ సాహిత్యోద్యమాల చరిత్ర, దళిత కథలు, ఆధునికాంధ్ర కవిత్వం, గురజాడ కథానికలు వంటి రచలను ఆయన వెలువరించారు. ఆయన సాహిత్య విమర్శనా వ్యాసాలు అన్ని పత్రికల్లో విరివిగా ప్రచురితమయ్యాయి. తనకు ఈ పురస్కారం రావడంపై రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రతినిధి వద్ద ప్రతిస్పందించారు.

ఇది తాను ఎదురు చూడని పురస్కారమని ఆయన అన్నారు. ఈ పురస్కారం లభించినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. జాతీయ స్థాయిలోనే ఇది అత్యున్నత పురస్కారమని, ఈ పురస్కారంతో తన బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు. భవిష్యత్తులో రాయలసీమ రచనలపై మరితంగా కృషి చేస్తానని ఆయన చెప్పారు.

English summary
an eminent Telugu literary critic Rachapalem chandrasekhar reddy has been honored with Kendra Sahithya akademi award.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X