చంద్రబాబుకు చెక్కును అందించిన రాంచరణ్...(పిక్చర్స్)
హైదరాబాద్: హుధుద్ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రను ఆదుకునేందుకు అనేక మంది ముందుకువచ్చి ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. శుక్రవారం ఏపి సిఎం చంద్రబాబునాయుడును కలిసిన సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ్ రూ. 15లక్షల చెక్కును సిఎం రిలీఫ్ ఫండ్కు అందజేశారు.
తుఫాను బాధితులను ఆదుకునేందుకు హైదరాబాద్లోని కెపిహెచ్పి కాలనీలోని 117 డివిజన్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఎం సాయిబాబాచౌదరి ఆధ్వర్యంలో పలువురు రూ. 61,500 విరాళాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు.
సచివాలయంలో ఏపి సిఎం చంద్రబాబును కలిసిన ఐటి సొల్యూషన్స్ అధినేత పత్తిపాటి భాస్కర్ రూ. 50వేలు, ఇంజినీరింగ్ విద్యార్థిని లావణ్య, ఇంటర్ విద్యార్థిని శ్రీలక్ష్మీభవాని అక్కా చెల్లెల్లు, తాతా, తల్లిదండ్రుల నుంచి సేకరించిన రూ. 10వేలు అందించారు. సర్దార్ పటేల్నగర్కు చెందిన ఉమా డిగ్రీ కాలేజీ అటెండర్ డి. నాగసత్తిబాబు రూ.1,500 తుఫాను బాధితుల కోసం విరాళంగా ఇచ్చాడు. చంద్రబాబు వారిని అభినందించారు.
తుఫాను విరాళం
ఇంజినీరింగ్ విద్యార్థిని లావణ్య, ఇంటర్ విద్యార్థిని శ్రీలక్ష్మీభవాని అక్కా చెల్లెల్లు, తాతా, తల్లిదండ్రుల నుంచి సేకరించిన రూ. 10వేలు అందించారు.
తుఫాను విరాళం
ఇంజినీరింగ్ విద్యార్థిని లావణ్య, ఇంటర్ విద్యార్థిని శ్రీలక్ష్మీభవాని అక్కా చెల్లెల్లు, తాతా, తల్లిదండ్రుల నుంచి సేకరించిన రూ. 10వేలు అందించారు.
తుఫాను విరాళం
సర్దార్ పటేల్నగర్కు చెందిన ఉమా డిగ్రీ కాలేజీ అటెండర్ డి. నాగసత్తిబాబు రూ.1,500 తుఫాను బాధితుల కోసం విరాళంగా ఇచ్చాడు. చంద్రబాబు వారిని అభినందించారు.
తుఫాను విరాళం
ఫిల్మ్ నగర్ క్లబ్ అధ్యక్షుడు కెఎస్ రామారావు, కమిటీ సభ్యులు రూ. 10లక్షల చెక్కును తుఫాను బాధితుల కోసం సిఎం రిలీఫ్ ఫండ్కు అందజేశారు.
తుఫాను విరాళం
ఏపి సిఎం చంద్రబాబుకు రూ. 2కోట్ల చెక్కును అందిస్తున్న శ్రీచైతన్య గ్రూప్ సంస్థల ప్రతినిధులు.
తుఫాను విరాళం
హోంమంత్రి చినరాజప్ప నేతృత్వంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నాయకులు రూ. 11,50,000 చెక్కును అందిస్తున్న దృశ్యం.
తుఫాను విరాళం
జబర్దస్త్ టీవీ కార్యక్రమం నటుల బృందం రూ. 4,41,000లను చంద్రబాబుకు అందిస్తున్న దృశ్యం.
తుఫాను విరాళం
రూ. 2 కోట్ల చెక్కును ఏపి సిఎం చంద్రబాబుకు అందిస్తున్న చల్లా రాజేంద్ర ప్రసాద్.
చెక్కు అందిస్తున్న రాంచరణ్
ప్రముఖ నటుడు రాంచరణ్ తేజ్ రూ. 15లక్షల చెక్కును ఏపి సిఎం చంద్రబాబుకు అందజేస్తున్న దృశ్యం.
తుఫాను విరాళం
తమిళ సినీ నటుడు సూర్య రూ. 50లక్షలను తన స్నేహితుల ద్వారా సిఎం చంద్రబాబుకు అందజేస్తున్న దృశ్యం.
తుఫాను విరాళం
శ్రీకాళహాస్తికి చెందిన రైస్ మిల్లర్ల అసోసియేషన్ తరపున రూ. 2,50,000లను అందిస్తున్న దృశ్యం.
తుఫాను విరాళం
సూపర్ గ్యాస్ ఉపాధ్యక్షుడు శ్రీమన్నారాయణ కడాలి చెక్కును ఏపి సిఎంకు అందిస్తున్న దృశ్యం.
తుఫాను విరాళం
రుణమాఫీపై సచివాలయంలో మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ఏపి సిఎం చంద్రబాబు.