సినిమా వాళ్లే దొరికారా?, పూరీ సవాల్ స్వీకరించండి: కేసీఆర్ సర్కారుపై రోజా ఫైర్
చిత్తూరు: డ్రగ్స్ వాడకాన్ని అరికట్టడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, నిఘా వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. ఇందులో ఉన్న పెద్దల్ని వదిలేసి కావాలనే సినిమా రంగానికి చెందిన వారిని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.
పరువు పోతోంది!: డ్రగ్స్ కేసులో కేసీఆర్ను టార్గెట్ చేసిన వర్మ
వేర్లను వదిలి కొమ్మల్ని, ఆకుల్ని పట్టుకుంటే ఫలితముండదని రోజా చెప్పారు. కేవలం రేటింగ్ కోసం కొన్ని మీడియా సంస్థలు సినీ తారలు పరువు బజారుకీడుస్తున్నాయని సినీ నటి కూడా అయిన రోజా మండిపడ్డారు.
మంగళవారం చిత్తూరు కలెక్టరేట్కు వచ్చిన ఆమె మాదకద్రవ్యాల అంశంపై మాట్లాడారు. డ్రగ్స్ వాడకంలో చాలా మంది ప్రముఖులున్నారని, వారిని ఏమీ చేయలేక సినీ తారల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
సత్యహరిశ్చంద్రులా?: చార్మి పిటిషన్పై ఆమె, ఎక్సైజ్ తరపు లాయర్ల పోటాపోటీ వాదనలు
మాదకద్రవ్యాల వినియోగంలో హస్తమున్న వారి పేర్లు చెప్తానని దర్శకుడు పూరీ జగన్నాథ్ చేసిన సవాలును ఎందుకు స్వీకరించలేదని నిలదీశారు. ఆయన చెప్పిన పేర్లను పరిగణనలోకి తీసుకుని ఎందుకు విచారించడం లేదని రోజా ప్రశ్నించారు.
కొంత నిరాశే, కానీ: చార్మి పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇలా