వైయస్ లానే జయ, తీరని బాధ: తన పెళ్లికి వచ్చారని గుర్తు చేసిన రోజా
తమిళనాడుకు అమ్మలేని లోటు తీర్చలేనిదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు.
హైదరాబాద్: తమిళనాడుకు అమ్మలేని లోటు తీర్చలేనిదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. జయలలిత.. ఎన్నో కష్టాలకోర్చి ముఖ్యమంత్రిగా ఎదిగారని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించవచ్చని జయలలిత నిరూపించారని రోజా అన్నారు.
Pics : జయలలిత కు నివాళి
జయలలిత మృతి బాధాకరమని ఆమె అన్నారు. తమిళ ప్రజలు జయను ప్రేమగా అమ్మా అని పిలుచుకుంటారని తెలిపారు. ఆమె మరణం కేవలం తమిళనాడుకే కాదు, యావత్తు దేశానికే తీరని లోటరి ఆమె అన్నారు. ఆమె ఓ శక్తివంతమైన నాయకురాలని కొనియాడారు.
'అమ్మ' అని అందుకే పిలుచుకుంటారు: వెంకయ్య, రోశయ్య విచారం
ఆమె ఇప్పుడలేరంటే.. ఎంతో బాధగా ఉందని అన్నారు. ప్రజలకు ఇంకా చేయాల్సి ఉన్నా.. ఆ దేవుడు అప్పుడే తీసుకెళ్లాడని అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో కూడా ఇలాగే జరిగిందని ఆమె అన్నారు.
రజినీకాంత్ వర్సెస్ జయలలిత: అప్పుడలా.. ఆ తర్వాతిలా!
తానంటే జయలలితకు ఎంతో ఇష్టమని రోజా చెప్పారు. తాను ఎప్పుడూ కలిసినా.. తనతో తెలుగులోనే మాట్లాడేవారని తెలిపారు. అంతేగాక, తన పెళ్లికి కూడా హాజరయ్యారని తెలిపారు. దేశం ఒక మంచి నాయకురాలిని కోల్పోయిందని చెప్పారు.