వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీ ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన లారీ: గాయాలు, ఆస్పత్రిలో చేరిక

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి శనివారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి శనివారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రసాద్ రెడ్డి కుటుంబ సమేతంగా పులివెందుల మీదుగా బెంగళూరుకు వెళుతుండగా నామాలగుండు సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.

Road accident: YSRCP MLA injured

సమాచారం అందుకున్న పులివెందుల పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన కుటుంబసభ్యులను పులివెందులలోని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం రాచమల్లు తన కుటుంబంతో బెంగళూరు పయనమయ్యారు.

English summary
YSR Congress Party MLA Rachamallu Siva Prasad Reddy and his family members injured in a Road accident, on Saturday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X