వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"గంటా-అయ్యన్న మధ్య మ్యాచ్ ఫిక్సింగ్?.. బాబే విష్ణుకుమార్ రాజు నోరు మూయించారు"

తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్దం అంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి గంటా కూడా సైలెంట్ అయ్యారని మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: చూస్తుంటే విశాఖ భూకుంభకోణం వ్యవహారం కూడా తెరమరుగయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలంతా దీనిపై వ్యూహాత్మక మౌనం వహిస్తుండటంతో.. కుంభకోణంపై మాట్లాడటానికి అటు వైసీపీకి అవకాశం లేకుండా పోతోంది. ప్రత్యర్థి నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా టీడీపీ నేతలు దీనిపై నోరు మెదిపేలా కనిపించడం లేదు.

తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి స్పందించారు. కుంభకోణంపై తొలుత దూకుడు ప్రదర్శించిన మంత్రి అయ్యన్నపాత్రుడు ఇప్పుడు సైలెంట్ అయిపోయారని విమర్శించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు-అయ్యన్నపాత్రుడుల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరగిందని, అందువల్లే అయ్యన్న నోరు మెదపడం లేదని ఆరోపించారు.

roja takes on ap ministers over vizag land scam

తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్దం అంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి గంటా కూడా సైలెంట్ అయ్యారని మండిపడ్డారు. భూఆక్రమణలు నిరూపిస్తామంటూ మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా మౌనం వహిస్తున్నారని, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి సహాయంతో ఆయన నోటికి చంద్రబాబు తాళం వేశారని రోజా విమర్శించారు.

English summary
YSRCP MLA Roja alleged that Ministers Ganta Srinivasa Rao and Ayyannapatrudu are match fixers in Vizag land scam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X