వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ నటి: రెస్క్యూ హోంకు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మోతీనగర్లో మంగళవారం రాత్రి పోలీసులు ఓ సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి నిందితులు ఇద్దరిని పోలీసులు బుధవారం కోర్టులో హాజరు పరిచినట్లుగా తెలుస్తోంది.
వారిని న్యాయస్థానం జ్యూడిషియల్ రిమాండుకు పంపించింది. సెక్స్ రాకెట్లో పట్టుబడ్డ టీవీ నటిని రెస్క్యూ హోంకు తరలించారు. హైదరాబాదులో వ్యభిచారం చేస్తున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
దీంతో మోతీ నగర్లోని ఓ ఆపార్ట్ మెంట్లో వ్యభిచారం చేస్తుండగా ఆమెను పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సెక్స్ రాకెట్లో పట్టుబడిన ఆర్టిస్ట్ను గుంటూరు జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు.
ఆర్గనైజర్లు శ్రీనివాస్, విమల్లను పోలీసులు జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. వారు హైదరాబాదుకు చెందిన వారే. వారు ఇటీవలె సదరు అపార్టుమెంటును అద్దెకు తీసుకొని, అందులో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఆర్గనైజర్ల పైన పిటా కింద కేసు నమోదు చేశారు.