అమ్మాయిలకు అశ్లీల చిత్రాలు చూపించిన టీచర్: బాలికపై రేప్ యత్నం
మహబూబ్నగర్/ గుంటూరు: విద్యార్ధినులపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేశారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. మహబూబ్నగర్ జిల్లా వెల్దండి మండలం, కొట్ర ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న రామస్వామి అనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు అశ్లీల దృశ్యాలను చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాడు, ఈ విషయాన్న విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలపై దాడి చేసి టీచర్ను చితకబాదారు. అనంతరం పోలీసులకు పిర్యాదు చేశారు.
డబ్బు కోసం యువతి బ్లాక్మెయిల్
ఇదిలావుంటే, డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాదులోని ఈసిఐఎల్లోని జినియా ఆస్పత్రి యజమాని - తనను నగ్నంగా ఫొటో తీశారని ఆరోపిస్తూ రూ. 50 లక్షలు ఇవ్వాలని యువతి బెదిరింపులకు దిగింది. దాంతో ఆ అమ్మాయిపై ఆస్పత్రి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామానికి చెందిన 12 ఏళ్ల వయస్సు గల బాలికపై అదే గ్రామానికి చెందిన డేవిడ్ అనే యువకుడు అత్యాచారనికి ప్రయత్నించాడు. బట్టలు ఉతికేందుకు కాలువకు వచ్చినన బాలికను సమీపంలోని పత్తిచేలోకి తీసుకుని వెళ్లి ఈ ఘాతుకానికి యత్నించాడు.
బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. దాంతో డేవిడ్ పరారయ్యాడు. ఈ మేరకు బాలిక తల్లి తుళ్లూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.