ఎస్ఐ, కానిస్టేబుల్ లంచం లకారం (పిక్చర్స్)
విశాఖపట్నం: కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేయకుండా, స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వస్త్ర వ్యాపారి నుంచి లక్షన్నర రూపాయలు డిమాండ్ చేసి, లక్ష రూపాయలకు బేరం కుదుర్చుకుని, ఆ మొత్తాన్ని తీసుకుంటూ విశాఖ త్రీ టౌన్ ఎస్ఐ జి రామారావు గురువారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. స్థానిక ఆర్కె ఫ్యామిలీ స్టోర్స్ అధినేత రాజ్కుమార్ మోడీ మూడు సంవత్సరాల కిందట బీచ్ రోడ్డుకు సమీపంలోని పాండురంగపురంలో ఫ్లాట్ కొనుగోలుకు బిల్డర్ శ్రీమాన్ పాండ్యన్కు 15 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు.
ఆ తరువాత కొద్ది రోజులకే పాండ్యన్ ఐపి పెట్టి పరారయ్యాడు. పాండ్యన్ ఇటీవల తిరిగి నగరానికి వచ్చాడన్న విషయం తెలుసుకున్న రాజ్కుమార్ అతని దగ్గరకు వెళ్లి, ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వీరి మధ్య మాట మాట పెరగడంతో పాండ్యన్ను, రాజ్కుమార్ తన వెంట తీసుకువచ్చి, ఒక ఇంట్లో బంధించి బెదిరించి, వదిలేశాడు. పాండ్యన్ నేరుగా త్రీ టౌన్ ఎస్ఐ రామారావుకు ఫిర్యాదు చేశాడు.
ఈ కేసులో రాజ్కుమార్ పరారీలో ఉండగా ఆయన సోదరుడు దినేష్కుమార్, మరో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తరువాత రాజ్కుమార్ను పిలిపించిన ఎస్ రామారావు, అతనికి స్టేషన్ బెయిల్ ఇస్తానని, అరెస్ట్ చేసిన వారికి కూడా బెయిల్ మంజూరయ్యేలా చేస్తానని ఇందుకుగాను లక్షన్నర రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఎసిబి వలలో ఎస్ఐ, కానిస్టేబుల్
రాజ్కుమార్ లక్ష రూపాయలు ఇస్తానని అంగీకరించి, బయటకు వచ్చి, నేరుగా ఏసిబి అధికారులను ఆశ్రయించాడు.
ఎసిబి వలలో ఎస్ఐ, కానిస్టేబుల్
ఎస్ఐ సూచనతో వ్యాపారి లక్ష రూపాయల లంచాన్ని కానిస్టేబుల్కు ఇస్తుండగా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
ఎసిబి వలలో ఎస్ఐ, కానిస్టేబుల్
రౌడీ షీట్ తెరుస్తామని వ్యాపారిని బెదిరించి లక్ష రూపాయల లంచం తీసుకుంటండగా ఎసిబి అధికారులు ఎస్ఐ జి. రామారావు, కానిస్టేబుల్ లక్ష్మణ రావును పట్టుకున్నామని ఎసిబి డిఎస్పీ నరసింహారావు చెప్పారు.
ఎసిబి వలలో ఎస్ఐ, కానిస్టేబుల్
ఏసిబి అధికారులు ఇచ్చిన కరెన్సీ నోట్లను రాజ్కుమార్ గురువారం తీసుకుని ఎస్ఐ రామారావుకు వద్దకు వెళ్లాడు. ఆయన ఆ మొత్తాన్ని, తన పక్కనే ఉన్న కానిస్టేబుల్ లక్ష్మణరావుకు ఇవ్వాలని సూచించాడు.
ఎసిబి వలలో ఎస్ఐ, కానిస్టేబుల్
రాజ్కుమార్ మొత్తాన్ని ఇచ్చిన వెంటనే అధికారులు దాడి చేసి ఎస్ఐ రామారావును, లక్ష్మణరావును అరెస్ట్ చేశారు.