భూమా ఫ్యామిలీతో పోటీ, సర్వేతో టిక్కెట్: శిల్పా, నారాయణరెడ్డి హత్యపై..
నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి కోసం తమ పార్టీ పలు సంస్థలతో సర్వే చేయించిందని, దాని ఆధారంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థిని ఖరారు చేస్తారని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి కోసం తమ పార్టీ పలు సంస్థలతో సర్వే చేయించిందని, దాని ఆధారంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థిని ఖరారు చేస్తారని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.
టిక్కెట్ విషయంలో పోటీ
టిక్కెట్ విషయంలో భూమా కుటుంబానికి, శిల్పా మోహన్ రెడ్డికి మధ్య పోటీ ఉందని తెలిపారు. అదే సమయంలో పత్తికొండ వైసిపి ఇంచార్జ్ నారాయణ రెడ్డి హత్యపై శిల్పా చక్రపాణి మాట్లాడారు.
బురద జల్లుతున్నారని..
హత్యా రాజకీయాల గురించి జగన మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని శిల్పా అన్నారు. మచ్చలేని తమ నాయకుడిపై బురద చల్లేందుకు జగన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారన్నారు.
వైయస్ ఉండగా..
వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా టిడిపి కార్యకర్తలను కోళ్లను కోసినట్లు కోయించలేదా అన్నారు. రాజకీయ హత్యలను సీఎం చంద్రబాబు ఏనాడు ప్రోత్సహించలేదన్నా రు. టిడిపి అధికారులను ఉపయోగించుకొని రాజకీయ హత్యలు చేస్తుందనడం దారుణమన్నారు
తెలియకనే..
మచ్చలేని తమ నాయకుడిపై జగన్ బురద జల్లుతున్నారన్నారు. నారాయణ రెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివారెడ్డి హత్యలలో గుట్టు తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారన్నారు. టిడిపి వచ్చాకే రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయన్నారు.