మోడీ! గుజరాత్ తెలివొద్దు, బాబు-జగన్లకు కేసుల భయం: హోదాపై ఏకేసిన శివాజీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయమై వివిధ పార్టీలను నిలదీస్తున్న నటుడు శివాజీ శుక్రవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివాజీ ప్రత్యేక హోదా కోసం ఎంతవరకైనా పోరాడుతానని కొద్ది రోజుల క్రితం చెప్పారు.
ఇప్పటికే శివాజీ టిడిపి, బిజెపి పైన మండిపడ్డారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పైన మండిపడ్డారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ గుజరాత్ తెలివితేటలు ఏపీపై ప్రదర్శిస్తున్నారన్నారు.
మోడీకి ఏపీ ప్రజల ఉసురు తగలడం ఖాయమన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు, కేసులకు భయపడి జగన్ కేంద్రాన్ని అడగలేకపోతున్నారన్నారు. ఏపీ ఎంపీలు సిగ్గులేని దద్దమ్మలన్నారు.
ప్రత్యేక హోదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయమై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మాట్లాడుకుంటున్న ప్రతినిధులు.
ప్రత్యేక హోదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయమై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న దృశ్యం.
ప్రత్యేక హోదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయమై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చేతులు కలిపిన నాయకులు.
ప్రత్యేక హోదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయమై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న నటుడు శివాజీ
ప్రత్యేక హోదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయమై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న నటుడు శివాజీ