వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు గారు, జగన్ 'చెప్పాడు': రోజా చెవిలో చెప్పడంపై అసహనం?

వైసిపి ప్లీనరీలో ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే రోజాకు చెవిలో చెప్పిన విషయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ప్లీనరీలో ఉమ్మారెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసిపి ప్లీనరీలో ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే రోజాకు చెవిలో చెప్పిన విషయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ప్లీనరీలో ఉమ్మారెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

జాగ్రత్త! బాబును జగన్ తిట్టమంటున్నారు: రోజాకు వేదిక పైనే ఇలా.. (వీడియో)జాగ్రత్త! బాబును జగన్ తిట్టమంటున్నారు: రోజాకు వేదిక పైనే ఇలా.. (వీడియో)

ఉమ్మారెడ్డి టిడిపిలో ఉన్నప్పుడు మహానాడు, ఇతర సమావేశాల తీర్మానాలను రూపొందించేవారు. వైసిపి ప్లీనరీలోను తీర్మానాలు మొదలు నాయకుల ప్రసంగాలను ఆయన వేదికపై ఉండి పర్యవేక్షించారు.

ప్లీనరీ తొలి రోజు రోజా మాట్లాడుతుండగా ఆమె వద్దకు వచ్చి చంద్రబాబును తిట్టమని చెబుతున్నారని, బాగా తిట్టమని చెప్పారు. మైక్ ఆన్ చేసి ఉండటంతో ఈ వ్యాఖ్యలు అందరికీ వినిపించాయి.

Some YSRCP leader unhappy with Ummareddy?

ఎవరిని అని రోజా ప్రశ్నించగా.. ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు గారిని తిట్టమంటున్నారని ఉమ్మారెడ్డి చెప్పారు. అంతుకముందే జగన్ తిట్టమన్నాడని చెప్పేందుకు ఉమ్మారెడ్డి.. 'చెప్పాడు' అన్నారు.

ఇక్కడ, చంద్రబాబును గౌరవించడం, జగన్‌ను చెప్పాడు అని ఏకవచనంతో సంభోదించడం పైన పార్టీలోను చర్చ జరుగుతోందంటున్నారు.

ఉమ్మారెడ్డి సంభోదనను వైసిపి నేతలు సీరియస్‌గా తీసుకోనప్పటికీ, ఒకరిద్దరు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. చంద్రబాబును గౌరవించడం, జగన్‌ను 'చెప్పాడు' అని వ్యాఖ్యానించడం పార్టీలో చర్చకు దారి తీసిందని అంటున్నారు.

English summary
It is said that, debate on plenary issue going in YSR Congress Party. Party senior leader Ummareddy Venkateswarlu suggested Nagari MLA Roja to blame AP CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X