నాటుకోడివేపుడు, చేపలపులుసుతో పాటు వెజ్ , నాన్ వెజ్ వెరైటీలతో అమిత్ షాకు బాబు విందు
తెలుగు వంటకాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు విందు ఇచ్చారు.ఈ విందుకోసం ఆయన భారీ మెనూను సిద్దం చేశారు.
అమరావతి:తెలుగు వంటకాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు విందు ఇచ్చారు.ఈ విందుకోసం ఆయన భారీ మెనూను సిద్దం చేశారు.
గురువారం నాడు అమరావతిలోని తన నివాసంలో చంద్రబాబునాయుడు అమిత్ షా లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో రెండు తెలుగురాష్ట్రాల్లో నెలకొన్న తాజా రాజకీయపరిస్థితులపై చర్చించారు.
పనసకాయ బిర్యానీ, గారెలు, గుంటూరు గొంగూర, ఆవకాయపచ్చడి, ఉలవచారు, పచ్చివెన్న, నాటుకోడి వేపుడు, చేపల పులుసుతో పాటు గుమ్మడికాయ ఒడియాలు, పూతరేకులు,బూరెలను ప్రత్యేకంగా వండి అమిత్ షాకు వడ్డించారు.
బొబ్బట్లు, వివిధ శాఖాహార కూరలు, బందరు లడ్డూలను ఈ మెనూలో చేర్చారు. గంటపాటు విందు భేటీ జరిగింది.అమిత్ షా కోసం తెలుగు వంటకాలను ఏరికోరి బాబు ప్రత్యేకంగా తయారు చేయించారు.
ఈ వంటకాల గురించి వివరిస్తూ వాటిని అమిత్ షా వడ్డించారు బాబు .ఈ విందులో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, సుజానాచౌదరితో పాటు రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ , కళా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.