అవసరాల మేరకు... దక్షిణాదిన ఏపీ ఒక్కటే: తెలంగాణకు అమ్మనున్న బాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రెండువేల మెగావాట్ల విద్యుత్ను తెలంగాణ రాష్ట్రానికి అమ్మనుంది. పవర్ ట్రేడింగ్ కార్పోరేషన్ (పిటిసి) ద్వారా దీనిని తెలంగాణకు ఇవ్వనుంది. 2016 జూన్ నెల నుంచి 2017 మే నెల వరకు ఏపీలో మిగులు విద్యుత్ ఉండనుందని ఏపీ ట్రాన్స్కో పంపిణీ కంపెనీలకు సమాచారమిచ్చింది.
ప్రతి నెల దాదాపు 300 మెగావాట్ల నుంచి 500 మెగావాట్ల వరకు ఏడాది పాటు మిగులు విద్యుత్ ఉండనుందని చెప్పింది.
అదే సమయంలో తెలంగాణ డిస్కమ్లు మే 27, 2016 నుంచి మే 25, 2017 మధ్య 2,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ఏపీ దృష్టికి వచ్చిది. ఈ నేపథ్యంలో ఏపీ మిగులు విద్యుత్ను తెలంగాణకు ఇచ్చే అవకాశముంది.
కాగా, ఏడాది మొత్తం మిగులు విద్యుత్ ఉండనుందని ఏపీ డిస్కమ్లు చెబుతున్నాయి. ఏడాది మొత్తం మిగులు విద్యుత్ ఉండటం ఇది మొదటిసారి. దక్షిణ భారత దేశంలో అవసరమైన మేర విద్యుత్ ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీ.