వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఉపఎన్నిక వేళ డీఎస్పీతో టీడీపీ ఎమ్మెల్యే సీక్రెట్ మంతనాలు, చెట్టు చాటున ఇలా!'

గోస్పాడు మండలం ఆంజనేయస్వామి గుడి వద్ద బనగానిపల్లె ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు చెట్టు చాటుకు వెళ్లి రహస్య మంతనాలు జరిపినట్లు ఆరోపిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: ఉపఎన్నికను ప్రభావితం చేసేలా టీడీపీ నేతలు ప్రలోభ పర్వాలకు దిగారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బుధవారం ఓవైపు ఎన్నిక జరుగుతుంటే.. మరోవైపు టీడీపీ నేతలు తమ ప్రలోభాలను కొనసాగించారని ఆరోపిస్తున్నారు.

పోలింగ్ బూత్ లోకి భూమా మౌనికారెడ్డి చొచ్చుకెళ్లారని, అఖిలప్రియ వార్డుల్లో ప్రచారం నిర్వహించారని వారు ఆరోపించారు. తాజాగా పోలీసులను సైతం వారు తమ ప్రలోభాలకు వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలు పిలిచిన వెంటనే వారి వద్ద వాలిపోయి రసహ్య సమావేశాల్లో పాల్గొంటున్నారని పోలీసులను ఉద్దేశించి ఆరోపణలు చేస్తున్నారు.

tdp mla janardhan reddy secret talk with dsp in gosopadu

ఎన్నికల తీరును పర్యవేక్షించాల్సింది పోయి తెర వెనుక రాజకీయాలకు తెరదీయడమేంటని వారు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ సమయం ముగుస్తున్న కొద్ది తెలుగుదేశం నేతలు పోలీసులతో రహస్య మంతనాలు జరుపుతున్నారని ఆరోపిస్తున్నారు.

ఉపఎన్నినక వేళ గోస్పాడు మండలం ఆంజనేయస్వామి గుడి వద్ద బనగానిపల్లె ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు చెట్టు చాటుకు వెళ్లి రహస్య మంతనాలు జరిపినట్లు చెబుతున్నారు.

English summary
YSRCP Leaders alleged that TDP Leaders are trying to manipulate the voters, they also alleged even though Police officials are also supporting them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X