చిక్కుల్లో టీడీపీ ఎంపీ : 'న్యూడ్ ఫోటో'లు పంపిస్తున్నారంటూ ఫిర్యాదు
తూర్పుగోదావరి : ఏపీ అధికార పార్టీ ఎంపీ తోట నర్సింహాంపై బాలల హక్కుల కమీషన్ కు ఫిర్యాదు అందినట్టుగా సమాచారం. పలువురు బాలికల ఫోన్ నంబర్లను, వాళ్లకు సంబంధించిన నగ్న ఫోటోలను తన అనుచరులకు మొబైల్ ద్వారా చేరవేస్తున్నారని ఆరోపిస్తూ.. ఎస్ రవి అనే న్యాయవాది బాలల హక్కుల కమిషన్ కు ఈ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.
విషయం ఏపీ హోంశాఖ వరకు వెళ్లడంతో.. దీనిపై ఏపీ డీజీపీని విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఘటనపై విచారణ జరిపి జూన్ 16 లోగా దీనికి సంబంధించిన నివేదికను సమర్పించాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా.. ఎంపీ తోట నర్సింహం కాకినాడ నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఫిర్యాదుపై స్పందించిన ఎంపీ తోట నర్సింహం మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. అవన్నీ
పూర్తిగా నిరాధారమని, అవాస్తవాలని కొట్టిపారేసిన ఆయన, ఫిర్యాదుదారుడిపై చట్టపరమైన చర్యలకు దిగుతున్నట్టుగా
ప్రకటించారు.