చంద్రబాబు స్నేహహస్తం ఇస్తోన్నా కెసిఆర్ అందుకోవడం లేదు: రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్నేహహస్తం అందిస్తున్నా తెలంగాణ సీఎం కెసిఆర్ స్వీకరించడం లేదని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహానాడులో మూడోరోజైన సోమవారం నాడు ఆయన ప్రసంగించారు
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్నేహహస్తం అందిస్తున్నా తెలంగాణ సీఎం కెసిఆర్ స్వీకరించడం లేదని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహానాడులో మూడోరోజైన సోమవారం నాడు ఆయన ప్రసంగించారు.
చంద్రబాబునాయుడు ఉదారస్వభావంతోనే తెలంగాణలో 24 గంటల పాటు కరెంట్ ఇవ్వగలుగుతున్నారని రేవంత్ చెప్పారు. ఎన్నికల హామీలన్నీ సీఎం కెసిఆర్ తుంగలో తోక్కారని ఆయన విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, తండాలను పంచాయితీలుగా మార్చడం, దళితులకు మూడెకరాలు, కేజీ టూ పీజీ హామీలను విస్మరించారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో అన్నివర్గాలు కేసీఆర్ పాలనపై అసంతృప్తిగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజాస్వామ్య హక్కులను కెసిఆర్ కాలరాస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ హాయంలోనే తెలంగాణలో స్వర్ణయుగం అవుతోందని చెప్పారు.
తెలంగాణలో సామాజిక న్యాయం కోసం ఇరురాష్ట్రాల మధ్య స్నేహసంబంధాల కోసం టీడీపీని గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.