సునామీకి పదేళ్లు: తీరంలో పూజలు(పిక్చర్స్)
విశాఖపట్నం: ప్రపంచ దేశాలను వణికించిన సునామీ సంభవించి శుక్రవారానికి పదేళ్ళు పూర్తయ్యింది. ప్రతి ఏడాది డిసెంబర్ 26వ తేదీన గంగమ్మతల్లికి పూజలు, అభిషేకాలు జరుపుకుని ప్రార్ధనలు నిర్వహించడం అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా శుక్రవారం మత్స్యకారులు, మత్స్యకార కుటుంబాలు, మహిళలు, కులపెద్దలు, సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పసుపు, కుంకుమ నీళ్ళను సముద్రంలో కలిపి ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు చేశారు.
మళ్లీ ఇటువంటి విపత్తులు సంభవించకుండా రక్షించాల్సిందిగా కోరుకున్నారు. గ్రామ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి 14 మత్స్యకార గ్రామాల నుంచి ఈ కుటుంబాలు, మహిళలు తరలివచ్చారు. దీంతో సముద్రతీరంలో సందడి వాతావరణం నెలకొంది.
గంగమ్మతల్లికి పూజలు నిర్వహించే కార్యక్రమానికి విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2004 డిసెంబర్ 26వ తేదీన దేశాన్ని గడగడలాడించిన సునామీ నుంచి రక్షించాలంటూ ప్రతి ఏడాది గంగమ్మతల్లికి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
తీరంలో పూజలు
ప్రపంచ దేశాలను వణికించిన సునామీ సంభవించి శుక్రవారానికి పదేళ్ళు పూర్తయ్యింది.
తీరంలో పూజలు
ప్రతి ఏడాది డిసెంబర్ 26వ తేదీన గంగమ్మతల్లికి పూజలు, అభిషేకాలు జరుపుకుని ప్రార్ధనలు నిర్వహించడం అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తోంది.
తీరంలో పూజలు
దీనిలో భాగంగా శుక్రవారం మత్స్యకారులు, మత్స్యకార కుటుంబాలు, మహిళలు, కులపెద్దలు, సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పసుపు, కుంకుమ నీళ్ళను సముద్రంలో కలిపి ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు చేశారు.
తీరంలో పూజలు
మళ్లీ ఇటువంటి విపత్తులు సంభవించకుండా రక్షించాల్సిందిగా కోరుకున్నారు. గ్రామ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి 14 మత్స్యకార గ్రామాల నుంచి ఈ కుటుంబాలు, మహిళలు తరలివచ్చారు. దీంతో సముద్రతీరంలో సందడి వాతావరణం నెలకొంది.
తీరంలో పూజలు
వేకువజాము నుంచి పసుపు, కుంకుమ నీళ్ళతో కూడిన బిందేలతో సముద్రం వద్దకు చేరుకుని వీటిని నీళ్ళల్లో కలిపి మరీ ఇటువంటి సునామీలు పునరావృత్తం కాకుండా అందర్ని రక్షించాల్సిందిగా గంగమ్మతల్లిని వేడుకున్నారు.
తీరంలో పూజలు
గంగమ్మతల్లికి పూజలు నిర్వహించే కార్యక్రమానికి విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
తీరంలో పూజలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2004 డిసెంబర్ 26వ తేదీన దేశాన్ని గడగడలాడించిన సునామీ నుంచి రక్షించాలంటూ ప్రతి ఏడాది గంగమ్మతల్లికి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
తీరంలో పూజలు
మత్స్యకారులు, మత్స్యకార కుటుంబాలు, మహిళలు, కులపెద్దలు, సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పసుపు, కుంకుమ నీళ్ళను సముద్రంలో కలిపి ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు చేశారు.