మహిళ గొంతు కోసి, దొంగల బీభత్సం, ప్రయాణీకులపై టీటీ ఓవరాక్షన్
ప్రయాణీకులను చితకబాదిన టీటీఈ
బేగంపేట రైల్వే స్టేషన్లో టీటీఈ అత్యుత్సాహం చూపించాడు. ఇద్దరు ప్రయాణీకుల వద్ద టిక్కెట్లు లేవని వారిని చితకబాదాడు. వారి దగ్గర ఉన్న బంగారు నగలను లాక్కొని పోయినట్లుగా తెలుస్తోంది. బాధితుల వివరాల మేరకు... పాండు, చందు అనే ఇద్దరు ప్రయాణీకులను టీటీ బేగంపేటలో బోగీ నుండి దించేశాడు. వారి సాక్సులు వాసన వస్తున్నయని చెప్పి వారిని దించారు. దీంతో వారు మరో బోగీలో ఎక్కేందుకు ప్రయత్నించారు. అయితే, వారిని అదే టీటీ మళ్లీ అడ్డుకున్నాడు. అప్పుడు వారి వద్ద ఉన్న మూడు తులాల బంగారు గొలుసులు తీసుకున్నాడు. వారిని కొట్టినట్లుగా తెలుస్తోంది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కలకలం రేపిన ఉన్మాది
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో ఉన్మాది కలకలం రేపాడు. జనంపైకి రాళ్లు రువ్వి భయభ్రాంతులను చేశాడు. కానిస్టేబుల్ వాహనాన్ని ధ్వంసం చేశాడు. మనిషిని చూస్తే రెచ్చిపోతున్న ఈ ఉన్మాదిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.
పోలీసుల తనిఖీలు
కాటేదాన్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బ్రాండెడ్ వస్తువులను పోలిన నకిలీ వస్తువులు తయారు చేస్తున్నారంటూ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తనిఖీలు చేశారు. నకిలీ కుక్కర్లు, ఫ్యాన్లు, మిక్సీలు తయారు చేస్తున్న కంపెనీని సీజ్ చేశారు.