అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీలో కలకలం: మహిళా మేయర్‌కు బెదిరింపు సందేశం

అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ స్వరూప సహా అధికార పార్టీ నేతలకు ఓ ఆగంతకుని నుంచి వస్తున్న బెదిరింపులు స్థానికంగా కలకలం సృష్టిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

అనంతపురం: నగర పాలక సంస్థ మేయర్ స్వరూప సహా అధికార పార్టీ నేతలకు ఓ ఆగంతకుని నుంచి వస్తున్న బెదిరింపులు స్థానికంగా కలకలం సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇలాంటి బెదిరింపులు మెసేజ్‌లు వస్తుండటంతో టీడీపీ నేతళ్ళో ఆందోళనకర పరిస్థితి నెలకొంది.

ఇటీవల మేయర్ స్వరూప, ఆమె భర్త వెంకటేష్‌కు ఓ గుర్తుతెలియని నెంబర్ నుంచి మేసెజ్ వచ్చింది. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలి పదవికి స్వరూప రాజీనామా చేయాలని, లేని పక్షంలో అంతుచూస్తామని ఆ సందేశంలో ఆగంతకుడు బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం.

A unknown person sent a threatening message to Anantapur mayor Swaroopa.

ఈ నేపథ్యంలో మేయర్ జనవరి 30న ఎస్పీ రాజశేఖరబాబుకు కార్యాలయంలో మౌఖికంగా ఫిర్యాదు చేశారు. అధికార పార్టీలో లుకలుకలు ఏర్పడినప్పుడల్లా ఇలాంటి సందేశాలు వస్తున్నాయంటూ ఆమె తెలిపినట్లు తెలిసింది.

కాగా, మేయర్‌కు మెసేజ్ పంపిన ఫోన్ నెంబర్ కడప జిల్లా మైదుకూరులో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మేయర్‌ను సంప్రదించగా మెసేజ్ వచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు.

English summary
A unknown person sent a threatening message to Anantapur mayor Swaroopa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X