కూకట్పల్లిలో టిప్పర్ బీభత్సం: వాకర్స్ పైకి దూసుకెళ్లడంతో మహిళ మృతి..
గాయపడ్డ వ్యక్తులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కూకట్పల్లి: హైదరాబాద్ లోని కూకట్పల్లి ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. వెనుక నుంచి వచ్చిన టిప్పర్ మార్నింగ్ వాకింగ్ చేస్తున్న ఏడుగురు వ్యక్తుల పైకి దూసుకెళ్లింది. దీంతో జ్యోతి(45) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా, ఒకరు స్వల్పంగా గాయపడ్డారు.
గాయపడ్డ వ్యక్తులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో టిప్పర్ బ్రేక్ ఫెయిల్ అయిందని డ్రైవర్ చెప్పినట్లు సమాచారం. బ్రేక్ ఫెయిలవడంతోనే వేగాన్ని నియంత్రించలేక ప్రమాదం చోటు చేసుకుందని అతను పేర్కొనట్లు తెలుస్తోంది.
ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.