రేవంత్పై యనమల, నేనే పార్టీవైపుంటే నీకేంటి:జగన్
విశాఖ: రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఇరికించిందని, తెలంగాణ సీఎం కేసీఆర్ కొంతకాలంగా రేవంత్ పైన కన్నేశారని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం అన్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియోలు ఫోరెన్సిక్ ల్యాబ్లో చూపిస్తే అసలు నిజం తెలుస్తుందన్నారు.
మంగళవారం విశాఖలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలో యనమల మాట్లాడారు. ప్రత్యేక హోదా పైన కూడా మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కేంద్రం పరిశీలనలో ఉందని చెప్పారు. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలన్నారు.
కాగా, చంద్రబాబు నాయుడు పైన వైసీపీ ఆధినేత జగన్ మండిపడ్డ విషయం తెలిసిందే. ఆయన గవర్నర్ను కలిసిన అనంతరం బాబు పై నిప్పులు చెరిగారు. శాసన మండలి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెరాసకు మద్దతిచ్చిందని, దీంతోనే వారి మధ్య ఉన్న లోపాయికార ఒప్పందం బహిర్గతమవుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు.
దీనిపై జగన్ తీవ్రంగా స్పందించారు. తాను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే నీకేమిటని చంద్రబాబును ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు తాత్కాలిక మద్దతు మాత్రమేనని, ప్రభుత్వం పైన మేమే పోరాటం చేస్తామని చెప్పారు. నేను ఏ పార్టీకి మద్దతిస్తే మీకేంటి అనడమే కాకుండా, తెలంగాణతో నీకేం సంబంధంని నిలదీశారు.