విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ గణతంత్రం: మొదటి బహుమతి దేవుడిదే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 66వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థాన శకటంతో ప్రారంభమైన ప్రదర్శన విశేషంగా జరిగింది.

వ్యవసాయ, నీటిపారుద, పురపాలక, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ, పౌరసరఫరాలు, జాతీయ ఆహార భద్రత సహా పలు శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. శకటాల ప్రదర్శన అనంతరం బహుమతుల ప్రదానోత్సవంలో తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి బహుమతి అందుకుంది.

TTD Sakatam got first prize in Ap R-Day Parade in Vijayawada

అలాగే వ్యవసాయ శాఖ శకటానికి ద్వితీయ బహుమతి, సాగునీటి శాఖ శకటం తృతీయ స్థానంలో నిలిచాయి. ఆయా శాఖలకు సంబంధించిన కమిషనర్లు గవర్నర్‌ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 66వ రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్.. తొలుత జాతీయ జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

English summary
TTD Sakatam got first prize in Ap R-Day Parade in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X