వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: తండ్రే అమ్మాయిపై రేప్ చేసి, ఆమెను చంపేశాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం బార్వాద్ సమీపంలో బాలికపై అత్యాచారం, హత్య కేసు కీలకమైన మలుపు తిరిగింది. ఈ సంఘటనలో బాలిక తండ్రే నిందితుడని తేలింది. తనపై దాడి చేసి, ఐదుగురు దుండగులు తన కూతురిని ఆటోలో ఎత్తుకెళ్లి, సామూహిక అత్యాచారం చేసి, ఆమెను హత్య చేశారని చెబుతూ వచ్చిన తండ్రి పూర్తిగా కట్టుకథ అల్లాడని పోలీసులు నిర్ధారించుకున్నాడు. దుండగులు అత్యాచారం చేసి, కట్టుకథ అల్లాడని పోలీసులు చెబుతున్నారు.

బాలిక తండ్రి మెగావత్ కమల్ కూతురు పట్ల అలా ఎందుకు వ్యవహరించాడనే విషయాన్ని రేపు ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. కూతురిని చంపేసిన తర్వాత కమల్ తన తలకు గాయం తగిలిందని నాటకమాడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మేఘావత్ కమల్ పోలీసుల అదుపులో ఉన్నారు. కేసును ఛేదించడానికి పోలీసులు 31 మంది ఆటో డ్రైవర్లను విచారించారు. అయితే, కమల్ వారినెవరీ గుర్తు పట్టలేదు. పైగా కమల్ విచారణలో భిన్న కథనాలు వినిపించాడు.

Meghavath Kamal

తాము నీళ్లు తాగుతుండగా దుండగులు తనపై దాడి చేయడంతో స్పృహ తప్పి పోయానని ఒక్కసారి చెప్పగా, తన కూతురిని ఆటోలో ఎత్తుకుపోతుండగా టూవీలర్‌పై వెంబడించానని, అయితే తాను పడిపోవడంతో గాయం తగిలిందని మరోసారి చెప్పాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి కమల్‌ను తీవ్రంగా విచారించారు. దీంతో అతను నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.

మేఘావత్ కమల్‌కు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ప్రస్తుత బాధితురాలు పెద్ద కూతురు. చందానగర్‌లో బంధువుల ఇంట్లో ఉన్న కూతురిని కమల్ తీసుకుని వస్తూ దారుణానికి ఒడిగట్టాడు. చీకట్లో వద్దని బంధువులు చెప్పినా వినకుండా అతను కూతురిని తీసుకుని బయలుదేరాడు. మృతురాలి అమ్మమ్మ కూడా పొంతన లేని విషయాలే మాట్లాడినట్లు తెలుస్తోంది.

మేఘావత్ కమల్ కుటుంబానికి మంచి పేరుంది. గ్రామస్థులు వారి గురించి చాలా బాగా చెబుతూ వచ్చారు. కానీ శనివారం ఉదయం నుంచి గ్రామస్థులంతా వారి గురించి అడిగితే నోరు మెదపలేదు. ఆ కుటుంబాన్ని వెలివేసినట్లుగా వ్యవహరించారు.

గురువారం రాత్రిపూట నిర్మానుష్యంగా ఉన్న దారిలో మంచినీళ్ల కోసం ఆ తండ్రీకూతుళ్లు ఆగారని, చీకట్లో మాటువేసిన కొందరు దుర్మార్గులు ఆ బాలిక తండ్రి తలపై బలంగా కొట్టి, ఆమెను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి చంపేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తానే నేరం చేసినట్లు మేఘావత్ కమల్ అంగీకరించినట్లు రంగారెడ్డి జిల్లా ఎస్పీ తెలిపారు.

English summary
In a shocking revelation, father Meghavath Kamal is the accused in tribal girl's rape and murder case. It was believed that, a tribal girl has been abducted, gang raped and killed in Rangareddy district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X