డబ్బులు తోడుకుంటున్నారు: బాబును ఏకేసిన ఉండవల్లి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మరోసారి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబునాయుడుకి లేదని ఆయన ఆరోపించారు.
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మరోసారి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబునాయుడుకి లేదని ఆయన ఆరోపించారు.
ఉండవల్లి అరెస్ట్-గోరంట్లను అడ్డుకున్న పోలీసులు: ఉద్రిక్తత
పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన మరోసారి ఆరోపించారు. ఆయా ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అక్రమాలపై తాను రెండున్నరేళ్ల నుంచి అనేక అంశాలపై రాష్ట్ర సర్కారుని ప్రశ్నిస్తున్నానని ఉండవల్లి అన్నారు.
తన ప్రశ్నలకు కనీసం ఆఫీస్ అటెండర్ నుంచి కూడా జవాబు రావడం లేదని వాపోయారు. పట్టిసీమ ప్రాజెక్టును నీళ్లు తోడే ప్రాజెక్టుగా కాకుండా డబ్బులను తోడే ప్రాజెక్టుగా ప్రభుత్వ నేతలు ఉపయోగించుకుంటున్నారని ఉండవల్లి మండిపడ్డారు.
సర్కారు పనితీరును అంచనా వేయడానికి కాగ్ నివేదికే సరైన ఆయుధమని ఉండవల్లి చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా చంద్రబాబు సర్కారు పనితీరును పీఏసీ ప్రశ్నిస్తుందని ఉండవల్లి అన్నారు.