హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లక్ష్మీపార్వతి నివాసంలో వాచ్‌మన్ అనుమానాస్పద మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి నివాసంలో వాచ్‌మన్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లక్ష్మీపార్వతి నివాసంలో ఏడాది కాలంగా రాజు అనే వ్యక్తి వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అతను భార్య, కుమార్తెతో కలిసి లక్ష్మీపార్వతి ఇంటి వెనక కాలనీలోని ఓ ఇంట్లో ఉంటున్నాడు.

ఇదే ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న స్వామి, రాజుల మధ్య నెలరోజులుగా గొడవ జరుగుతోంది. గురువారం కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో రాజు భార్య, కుమార్తె శుక్రవారం బయటకెళ్లి వచ్చేసరికి రాజు ఉరివేసుకొని కనిపించాడు.

died

రాజును స్వామే ఉరివేసి చంపాడంటూ స్థానికులు ఆరోపించారు. పోలీసులు మృత దేహాన్ని తరలించే సమయంలో స్థానికులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసులు స్వామిని అరెస్టుచేశారు.

హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లోగల లక్ష్మీపార్వతి నివాసం ఉంది. ఆమె నివాసంలో పనిచేస్తున్న రాజు కాకినాడకు చెందినవాడు.

English summary
Watchman Raju working in Lakshmi Parvathi's residence died in suspecious conditions at Film Nagar in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X