నంద్యాల ఉప ఎన్నికలకు ముందు జగన్కు గంగుల ప్రతాప్ రెడ్డి షాక్?
నంద్యాల ఉప ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలనుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో కర్నూలులో రసవత్తర రాజకీయం కనిపిస్తోంది.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలనుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో కర్నూలులో రసవత్తర రాజకీయం కనిపిస్తోంది.
జగన్కు షాకిస్తూ వైసిపిని వీడుతారా?
మాజీ పార్లమెంటు సభ్యులు గంగుల ప్రతాప్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆయన తెలుుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
మంత్రి అచ్చెన్నతో భేటీ
ఆయన బుధవారం మంత్రి అచ్చెన్నాయుడుతో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక తదితర అంశాలపై చర్చించారని ప్రచారం సాగుతోంది. ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కూడా కలవనున్నారని తెలుస్తోంది.
ఈ రోజే భేటీ అవుతారని...
చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి ముఖ్యమంత్రి వద్దకు గంగుల ప్రతాప్ రెడ్డి వెళ్లనున్నారు.
గంగుల కూడా సిద్ధమయ్యారు
నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని ఓ సందర్భంలో గంగుల ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. వైసిపిలో చేరి, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత వైసిపిలో చేరారు. కానీ అనూహ్యంగా శిల్పా మోహన్ రెడ్డి టిడిపి నుంచి వైసిపిలో చేరారు. ఆయన వైసిపి తరఫున పోటీ చేస్తున్నారు.