ఇంటికి తీసుకు వెళ్తానని మహిళపై అత్యాచారం
చిత్తూరు: భర్త వేధింపులు భరించలేక పుట్టింటిలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్న ఓ వివాహితపై బుధవారం రాత్రి ఇద్దరు అత్యాచారానికి పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో జరిగింది. అత్యాచారానికి పాల్పడిన ప్రేమ్ కుమార్, చలపతి అనే కూలీలను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మేస్త్రీ పని చేసుకుని జీవించే భర్త తన భార్యను వేధిస్తు ఉండేవాడు. ఈ వేధింపులు భరించలేని ఆమె రెండు నెలల క్రితం తండ్రి వద్దకు వచ్చింది. దీంతో ఆమెకు కూడా చిన్న ఉద్యోగం ఇప్పించాడు. ఉదయం 11.30 గంటలకు పనికి వెళ్లే ఆమె రాత్రి 9.30 గంటలకు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి.
దీంతో తమ్ముడిని తోడుగా పిలిపించుకుని ఇంటికి చేరేది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి తన తమ్ముడుతో కలసి ఆమె ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో తారకరామా నగర్లో ప్రేమ్ కుమార్ మోటారు సైకిల్ తీసుకుని తానూ ఇంటికి వెడుతున్నానని తనతో వస్తే ఇంటి వద్ద దించేస్తానని చెప్పాడు.
కొంత దూరం వెల్లగానే బండిలో పెట్రోల్ అయిపోయిందని నటిస్తూ ఆమె తమ్ముడిని ఇంటికి పంపించేశాడు. ఒంటరిగా వస్తున్న ఆమెను ప్రేమ్ కుమార్ స్నేహితుడు చలపతితో కలిసి అటుగా వస్తున్న ఆమెను బలవంతంగా తమ మోటారు సైకిల్ పైన ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు.