కిలాడీ లేడీ అరెస్టు: అసభ్యంగా ప్రవర్తించాడని డాక్టర్పై నింద
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ ఏడాది జనవరి 17న సాయికుమారి, తల్లి సరోజినిదేవి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు ఈసీఐఎల్లోని జీనియా ఆసుపత్రికి తరలించారు. వీరు చికిత్స అనంతరం పూర్తిగా కోలుకొని తిరిగి ఇంటికి వెళ్లారు. కొద్ది నెలల అనంతరం సాయికుమారి తల్లి సరోజినీదేవి అనారోగ్యంతో మృతి చెందింది.
వారం రోజుల నుంచి సాయికుమారి జీనియా ఆసుపత్రికి వెళ్తూ చికిత్స సమయంలో ఆసుపత్రి డాక్టర్లు కొందరు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తనకు రూ. 50లక్షలు నష్టపరిహారంగా ఇవ్వాలని లేకుంటే ఈ విషయాన్ని పోలీసులకు, మీడియాకు చెబుతానని పదే పదే ఫోన్లలో బెదిరిస్తుండటంతో విసిగిపోయిన ఆసుపత్రి ఎండీ చైతన్యరెడ్డి కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుషాయిగూడ బస్టాప్లో ఓ బట్టల దుకాణం ఎదుట అరటిపండ్ల తోపుడు బండి తొలగించడంలో జోక్యం చేసుకొని సదరు బట్టల దుకాణం యజమానిని రూ. 4లక్షలు ఇవ్వాలని ఫోన్లో బెదిరించింది. సాయికుమారిపై ఐపీసీ 448, 389, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.