వితంతువుపై ఆటో డ్రైవర్ రేప్: టీ సచివాలయం వద్ద ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరెడలో ఆటోడ్రైవర్ వితంతువుపై దాడి చేసి అత్యాచారం జరిపాడు. ఆటోడ్రైవర్ దాడిలో మహిళకు తీవ్రంగా గాయ పడింది. స్థానికులు ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అతను ఆ దుర్మార్గానికి పాల్పడ్డాడు. చాలా కాలంగా ఆమెపై ఆటో డ్రైవర్ గోగుల రాంబాబు (45) కన్నేశాడు. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుంటే, హైదరాబాదులోని తెలంగాణ సచివాలయంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఉట్లపల్లి గ్రామానికి చెందిన చండూరు చంద్రశేఖర్ అనే వ్యక్తి తెలంగాణ సచివాలయంలోని సి-బ్లాక్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
మూడేళ్ల క్రితం శేఖర్ ఉట్లపల్లి గ్రామంలోని సబ్స్టేషన్లో ఔట్సోర్సింగ్ ఆపరేటర్గా పనిచేశాడు. సంవత్సరం క్రితం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అతని స్థానంలో మరొకరిని నియమించారు. దీంతో మనస్థాపానికి గురైన శేఖర్ తన ఉద్యోగం తనకు ఇప్పించాలని కోరుతూ శుక్రవారం నాడు సచివాలయానికి వచ్చి సీ-బ్లాక్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అయితే ఆర్థిక సమస్యలు తాళలేక చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్లోని హుమాయున్నగర్లో లైసెన్స్ లేని రివాల్వర్ కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తుపాకీ, 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.